మలికిపురం: పూడికతీత పనులు ప్రారంభం

77చూసినవారు
మలికిపురం: పూడికతీత పనులు ప్రారంభం
మలికిపురం మండల పరిధిలో పలుచోట్ల డ్రైన్లలో పూడికతీత పనులు జరిగాయి. ఈ డ్రైన్లలో గుర్రపు డెక్క పెరిగిపోయి మురికినీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. వరి చేలలో ముంపు నీరు దిగక ఏటా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రైతులు పూడిక తొలగించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలపై పనులు ప్రారంభించామని తహశీల్దార్ అనితకుమారి శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్