గాలి వానకు కొబ్బరి చెట్టు విరిగి కరెంటు వైర్లపై పడిన సంఘటన కోడూరు శివారు నరసింహపురం గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం భారీ ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షం కురవగా ఆగాలులకు కొబ్బరి చెట్టు విరిగి కరెంటు వైర్లు పైపడింది, రాత్రి సమయం కావడంతో ఎవరు లేకపోవడం ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు కొబ్బరి చెట్టును తొలగించి ఈ ప్రమాదంలో విరిగిన కరెంటు స్తంభాన్ని పునరుద్ధరించారు.