మచిలీపట్నం: బాక్స్ సౌండ్ తగ్గించమన్నందుకు వ్యక్తిపై దాడి

71చూసినవారు
డీజే బాక్స్ ల సౌండ్ తగ్గించమని అడిగిన వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో మంగళవారం రాత్రి జరిగింది. మచిలీపట్నం నిజాంపేటలో నివాసం ఉంటున్న వడ్లమూడి రఘురాంపై ఎదురుగా ఉంటున్న అడపాల హర్ష దాడి చేసినట్టు తెలిపారు. 90 సంవత్సరాల వయసు కలిగిన రఘురాం అత్త డిజె సౌండ్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో సౌండ్ తగ్గించమన్నందుకు దాడి చేసినట్టు తెలిపారు. ఈ విషయమై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్