కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేంద్ర భద్రతా బలగాలు పురవీధుల్లో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ కవాతు నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేమున్నామని సందేశాన్ని వినిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వాటి పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లను చేశారు.