జి. కొండూరు: చెవుటూరులో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

79చూసినవారు
జి. కొండూరు: చెవుటూరులో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులో గురువారం స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్ ఆద్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్బంగా చెవుటూరు గ్రామ సచివాలయంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నిబోయిన శ్రీను, పూర్ణ రెడ్డి, జిలానీ, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్