కంచికచర్లలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ పై దాడి

52చూసినవారు
కంచికచర్ల మండలం పరిటాలలో రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న సుమారు 600 బస్తాల రేషన్ బియ్యాన్ని కంచికచర్ల ఎస్సై రాజు దాడి చేసి ఆదివారం పట్టుకున్నారు. కార్డ్ దారుల నుండి ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచిన సమాచారం తెలుసుకున్న ఎస్సై రేషన్ బియ్యం నిల్వపై దాడి చేసి వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. రీసైక్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యం లో కలిపి భారీ అమ్మకాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

సంబంధిత పోస్ట్