చందర్లపాడు మండలంలోని విభరింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు రూ. 5 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న డొంక రోడ్డు గ్రావెల్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్. మొండితోక
జగన్ మోహన్ రావు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి వైయస్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.