సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఆగస్టు 29 - సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ బంద్

82చూసినవారు
సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఆగస్టు 29 - సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ బంద్
సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అందుబాటులో ఉండదని పాస్‌పోర్ట్ సేవా సపోర్ట్ తెలిపింది. ఈ పోర్టల్ ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం వరకు దేశవ్యాప్తంగా మూసివేయబడుతుందని వెల్లడించింది. "ఈ సమయంలో పాస్‌పోర్ట్ వ్యవస్థ పౌరులకు, అధికారులకు అందుబాటులో ఉండదు. ఆగస్టు 30 - సెప్టెంబర్ 2 మధ్య అన్ని అపాయింట్‌మెంట్ లు వేరే తేదీకి రీషెడ్యూల్ చేస్తాం" అని 'ఎక్స్'లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్