మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మృతి

66చూసినవారు
మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మృతి
కృష్ణా జిల్లా, పామిడిముక్కల మండలం మామిళ్ల పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైయస్సార్ పార్టీ నాయకులు ఆముదాల పల్లి వెంకటేశ్వరరావు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఇరువురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వరరావు కుమారుడు సుబ్రహ్మణ్యం ప్రస్తుతం సర్పంచ్ గా ఉన్నారు. సౌమ్యుడుగా పేరుందిన వెంకటేశ్వరరావు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్