బంటుమిల్లి కాలువ సమీపంలోని సాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలోని బంటుమిల్లి కాలువను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి కాలువలో వరద నీటి ప్రవాహం గురించి వివరాలను కలెక్టర్ జలవనుల శాఖ డిఈ సూర్య భరత్ ను అడిగారు.