రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎమ్మెల్యే

71చూసినవారు
వర్షాల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. బంటుమిల్లి గ్రామాలలోని డ్రైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్క, తూటుకాడ తొలగించే పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని డ్రైన్ల నుంచి మురుగునీరు, వర్షపు నీరు పోయేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్