కొట్టుకుపోయిన యుద్దట్యాంక్..జవాన్లు మృతి

572చూసినవారు
కొట్టుకుపోయిన యుద్దట్యాంక్..జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. లద్దాఖ్ లో నది దాటుతూ యుద్దట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్, ప్రకాశం జిల్లాకి చెందిన ఎం.ఆర్కే రెడ్డి ఉన్నారు. వారి పార్థివ దేహాలకు ఎయిర్ పోర్టు టెర్మినల్ వద్ద ఆర్మీ లాంఛనాలతో అధికారులు నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్