నిత్యవసర సరుకుల కోసం రోడ్డున పడిన వరద బాధితులు

84చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకుల కోసం వరద బాధితులు రోడ్డున పడ్డారు. విజయవాడలో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సైతం లెక్కచేయకుండా భవానిపురం రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్రదేశంలో క్యూకడుతున్నారు. ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకోవడం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడినప్పటికీ సర్వర్ పనిచేయకపోవటంతో క్యూలైన్లో నిలబడిన వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్