విజయవాడ సౌత్ జోన్ ఏసీపీని కలిసిన టీడీపీ నాయకులు

75చూసినవారు
విజయవాడ సౌత్ జోన్ ఏసీపీని కలిసిన టీడీపీ నాయకులు
విజయవాడ సౌత్ డివిజన్ ఏసీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన యూ బంగారు రాజుని టీడీపీ నాయకులు, యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ సోమవారం మర్యాద పూర్వంగా కలిసారు. శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం నజీర్ తమ సంస్థ ద్వారా తాము నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో శిరీష్, పసుపులేటి బాలు, వినయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్