విరాళాలు అందిస్తున్న విద్యార్థులు స్ఫూర్తిప్రదాతలు

79చూసినవారు
విరాళాలు అందిస్తున్న విద్యార్థులు స్ఫూర్తిప్రదాతలు
వరదలకు సర్వస్వం కోల్పోయిన వరద బాధిత కుటుంబాల కోసం స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్న విద్యార్థులు స్ఫూర్తిప్రదాతలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎస్. వి. ఎల్ క్రాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో కృష్ణానది వరద బాధితుల కోసం సేకరించిన 3. 04 లక్షల నగదు అవనిగడ్డ ఎమ్మెల్యే కు అందజేశారు. గతంలో కూడా ఈ కళాశాల నుంచి ఎందరికో సహాయం అందించిన విద్యార్థులు అభినందనీయులన్నారు.

సంబంధిత పోస్ట్