శ్రీమన్నారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయంలో స్వామివారికి తొలి ఏకాదశి సందర్బంగా బుధవారం ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అష్టాక్షరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో అష్టోత్తర శత కలశ పూజ నిర్వహించారు. అనంతరం స్వామి వారి మూల మూర్తులకు అష్టోత్తర శత కలశ స్నపన, తిరుమంజన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్