తీరప్రాంత గ్రామాల ప్రజల దాహర్తిని తీర్చాలి

58చూసినవారు
నాగాయలంక, కోడూరు మండలాల్లోని తీరప్రాంత గ్రామాల ప్రజల దాహర్తి తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం అవనిగడ్డలో బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కమ్మనమోల నుంచి తీరప్రాంత గ్రామాలకు త్రాగునీటి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తీరగ్రామాలకు ఆకు పచ్చని నీరు సరఫరా అవుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్