ఉంగుటూరు మండలం ఆముదాల పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం, వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, రాష్ట్ర వైసీపీ నాయకులు గోసుల శివ భరత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి వంశీకి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వి సరోజినీ, మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.