గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనిగండ్ల రామును ప్రజా వేదిక కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ మీడియా అసోసియేషన్ గుడివాడ నియోజకవర్గ జర్నలిస్టులు శాలువాలతో పూదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీఎ రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, గుడివాడ నియోజకవర్గం అధ్యక్షులు జి శ్యాంబాబు, జనరల్ సెక్రటరీ ఉల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.