ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

72చూసినవారు
రైతులు రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ సాగుపైన అవగాహన పెంపొందించుకోవాలని ప్రకృతి వ్యవసాయ మండల ఇన్ ఛార్జ్ గౌతమ్ కూమార్ అన్నారు. ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో అదివారం ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేక కార్యక్రమంగా మొక్కల ఎదుగుదల ద్రావణం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సాగులో ఆరోగ్యకరమైన రసాయన రహిత ఆహార ఉత్పత్తులను సాధించవచ్చన్నారు. ఐసీఆర్పీ సుధాకర్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్