ముదినేపల్లి: మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి

58చూసినవారు
మధ్యాహ్న భోజనంలో మెనూ, నాణ్యత తప్పక పాటించాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ షరీప్ సూచించారు. ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పప్పు పలచగా ఉందని, నాణ్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు.బోజన నాణ్యత పై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్