చికిత్స పొందుతూ యువకుడు మృతి

67చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం ఈ నెల 6వ తేదీన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇందులో మల్లపరాజుగూడెంకి చెందిన యువకుడు పుప్పాల సుబ్రహ్మణ్యం (26) తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ యువకుడు శుక్రవారం మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

సంబంధిత పోస్ట్