స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి: కమిషనర్

77చూసినవారు
స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి: కమిషనర్
స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్