టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు డిఈఓ కీలక సూచనలు

80చూసినవారు
టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు డిఈఓ కీలక సూచనలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని డిఈఓ సుల్తానా బుధవారం సూచించారు. అభ్యర్థి హాల్ టికెట్ ఫోటో లేనట్లయితే తాజా పాస్పోర్ట్ ఫొటో, ఆధార్, పాన్, ఓటర్ కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. 3న ఉదయం పరీక్ష రాసేవారు 8.30 గంటలకు, మధ్యాహ్నం రాసేవారు 1.30 గంటలకు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి రావాలని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్