మైలవరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ

556చూసినవారు
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు జి. కొండూరులో కమ్యూనిటీ హాలులో వరద బాధితులకు గురువారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ముందుగా బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. వరద బాధితులకు సాయం అందించడంలో అలుపెరుగని కృషి చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్