కృష్ణాజిల్లా గుడివాడ-విజయవాడ రోడ్డుపై పునాదిపాడు నుంచి గుడివాడ వరకు కిలోమీటర్ల మేర గుంటలు ఏర్పడటంతో వాహనదారులకు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ప్రజలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేయమని కోరినా స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మించి, రోడ్డు దారులను సురక్షితంగా చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.