మైలవరం: జి. కొండూరు మండలంలో రహదారులకు భూమి పూజ

55చూసినవారు
మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 10082 మీటర్ల పొడవునా 41 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 5. 16 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. వెలగలేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొని సీసీ రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్