మైలవరం: ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యం

69చూసినవారు
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ మహాకూటమి ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్