లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా రఘునాథరెడ్డి ఎన్నిక

56చూసినవారు
లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా రఘునాథరెడ్డి ఎన్నిక
లయన్స్ క్లబ్ ఆఫ్ కొండపల్లి ఇండస్ట్రియల్ పార్కు నూతన అధ్యక్షుడిగా రేగళ్ల రఘునాథరెడ్డి ఆదివారం ఎన్నికయ్యారు. పారిశ్రామికవాడలోని ఐలా కార్యాలయంలో లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. లయన్స్ జిల్లా గవర్నర్ జేఎన్ శంకర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎ. సురేష్, కోశాధికారిగా షేక్ జాకీర్ హుస్సేన్లను తిరిగి ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్