ముసునూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

82చూసినవారు
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం రాత్రి ముసునూరు మండలంలో పర్యటించారు. ముసునూరు గ్రామం దళితవాడలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి చేతుల మీదుగా అధికారులు శంకుస్థాపన చేశారు. రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు దేవినేని డాలరాం ఆధ్వర్యంలో స్థానికులు మంత్రిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్