నూజివీడు: మినుము రైతులను ఆదుకోవాలి

78చూసినవారు
ఏలూరు జిల్లా నూజివీడులోని రామిలేరు వరద వల్ల నష్టపోయిన మినుము రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో పల్లెర్ల మూడి శివారు శోభనాపురంలో ఆదివారం మినుము రైతులు నిరసన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడారు. రామిలేరు వరద వల్ల మినుము పంట దెబ్బతిని రైతుల తీవ్రంగా నష్టపోయారన్నారు.

సంబంధిత పోస్ట్