మునిగిపోయిన నూజివీడు బస్టాండ్ ప్రాంతం

53చూసినవారు
భారీ వర్షానికి నూజివీడు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం అంత శనివారం వరదనీటిలో మునిగిపోయింది. బస్టాండ్ ఆవరణలో పెట్టిన వివిధ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. అతి భారీగా వరద నీరు చేరడంతో బస్టాండు లోని ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఈ వరద నీటిని చూసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్