చెత్త,కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దండి

70చూసినవారు
చెత్త,కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దండి
స్వచ్ఛత హి కార్యక్రమం కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుడివాడ డిఎల్పిఓ సంపత్ కుమారి ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామంలో మొక్కలు నాటేందుకు దాత చెన్నకేశవల నాగమల్లేశ్వరరావు 50వేల రూపాయలు విలువైన 70 మొక్కలను అందజేయడం సంతోషకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్