కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామ సర్పంచ్ పందిర ఇందిరను కంకిపాడు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్ ల సంయుక్తంగా మంగళవారం నాడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన తరుణంలో కంకిపాడు పోలీసులు ఈడుపుగల్లు సర్పంచి పందిర ఇందిరను గృహ నిర్బంధం చేశారు.