టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

4909చూసినవారు
ఉయ్యూరు పట్టణం 15వ వార్డు లంబాడి పేట నుంచి సుమారు 50 కుటుంబాలకు పైగా శుక్రవారం టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
జోగి రమేష్ పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్