ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొటికలపూడి గ్రామంలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరులు అరాచకం సృష్టించారు. దళితుల ఇళ్లపై బాంబులు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో దళితులు ఆందోళనకు దిగారు.