తిరువూరులో నాటు సారాస్థావరంపై పోలీసులు మెరుపు దాడి

66చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం(మ), పెద్దకొమెర గ్రామంలో నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు మంగళవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 20 లీ. నాటుసారా, 500 లీ. బెల్లపు ఊట ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు ఈదాడి చేయడం జరిగిందని తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం త్వరలో మీడియాకు వెల్లడిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్