రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని 70% కుటుంబాలు తీవ్ర దుర్భిక్షం పాలవడంతో మద్యంపై యుద్ధం కొనసాగింపుగా 31న మహాధర్నా ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గా భవాని పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో హింసతో పాటు నేరప్రవృత్తి పెరుగుతోందన్నారు. దీనికి కారణం మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు.