వరద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

78చూసినవారు
వరద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఏకలవ్య నగర్, జొజీ నగర్, ఊర్మిళ నగర్, పున్నమి ఘాట్, పడవలరేవు, తదితర ప్రాంతాలను బుధవారం పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రకృతి విపత్తు వలన వరదలు సంభవించడం దురదృష్టకరమన్నారు. బాధితులతో ముఖాముఖి చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్