ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారని డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో ఆదోని వన్ టౌన్ పిఎస్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించారు. ప్రజల్లోని భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా భరోసా కల్పించడమే ముఖ్యోద్దేశ్యమన్నారు.