కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్దులు ఐటీ అండ్ ఐటీఈఎస్ వొకేషనల్ లో భాగంగా కొడుమురులోని 2వ సచివాలయం సందర్శించటం జరిగింది. ఈ సందర్శన ప్రిన్సిపాల్ ఆశాజ్యోతి, వొకేషనల్ ట్రైనర్ వరుణ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్ జయచంద్ర విద్యార్థులకు కంప్యూటర్ యొక్క ప్రాముఖ్యతతో పాటు సచివాలయంలో జరిగే ఆన్లైన్ సేవల గురించి క్లుప్తంగా వివరించారు.