మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఫల పంచామృత, పసుపు, కుంకుమ, గంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంచాలమ్మ దేవికి పసుపు, వివిధ రకాల పూలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతులు మహా మంగళ హారతులు ఇచ్చారు.