కోసిగి మండలం వందగల్ లో శుక్రవారం మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరుపున టీడీపీ నేతలు రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన బాలనాగిరెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఈసారి మీ బిడ్డ రాఘవేంద్ర రెడ్డిని ఎమ్మెల్యేగా ఆదరించాలని కోరారు.