పత్తికొండ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పర్యటనను విజయవంతం చేసినందుకు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ పత్తికొండ తుగ్గలి మద్దికేర క్రిష్ణగిరి వెల్దుర్తి మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.