వేర్వేరుగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
By W. Abdul 573చూసినవారుఆదోని టీడీపీ నేతలు వేర్వేరుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన స్వగృహంలో ఎన్టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి పార్టీ జెండాను ఎగురవేశారు. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఇన్ఛార్జీ కృష్ణమ్మ తన స్వగృహంలో ఎన్టిఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.