ఆదోని మండలంలోని గ్రామాల్లో నెలకొన్న తాగు నీటి సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు, మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆదోనిలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో శుద్ధి చేయని నీరు సరఫరా చేయడం వల్ల ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.