ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ఆదివారం పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇంతవరకు ఆదోని నుంచి మంత్రి కాలేదని, పార్థసారథి మెజారిటీతో గెలిచినందుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దక్కకపోతే ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు. మంత్రి పదవితోనే ఆదోని మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.