ఏప్రిల్ 2వ తారీఖు వరకు వడగాలులు విస్తుండడంతో ప్రజలు అవసరమైతే తప్ప ఎక్కువగా బయటికి తిరగరాదని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుజాత పేర్కొన్నారు. శనివారం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లలు వృద్దులు ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకుని వెళ్లాలని మజ్జిగ, నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫలాలను సేవించాలని సూచించారు.