వసతి గృహాల్లోవిద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనాలు అందించకపోతే చర్యలు తప్పవని తహసీల్దారు ప్రతాప్ రెడ్డి వసతిగృహ సంరక్షకులను హెచ్చరించారు. ప్యాపిలీ పట్టణంలోని బీసీ బాలుర, ఎస్బీ బాలికల, కస్తూర్బా గాంధీ వసతి గృహాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దారు మారుతీ, వీఆర్వో సోమశేఖర్ పాల్గొన్నారు.