చేతి వృత్తిదారులను ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలి: సీపీఐ

85చూసినవారు
చేతి వృత్తిదారులను ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలి: సీపీఐ
చేతి వృత్తిదారులను ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె. రామాంజినేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కోడుమూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైనా చేతి వృత్తిదారుల గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. ప్రభుత్వం చేతి వృత్తిదారులకు వెంటనే న్యాయం చేయాలన్నారు. క్రిష్ణ, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్